గురువారం, 3 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జులై 2025 (13:23 IST)

గోదావరిలో వరదలు: దేవీపట్నం నుండి పాపికొండలకు పడవ యాత్ర బంద్

Papikondalu Boat Tour
Papikondalu Boat Tour
దేవీపట్నం నుండి పాపికొండలకు ప్రసిద్ధి చెందిన పడవ యాత్రను జలవనరుల శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతోంది. దేవీపట్నం మండలంలోని దండంగి, డి. రవిలంక గ్రామాల మధ్య ఆర్ అండ్ బి రోడ్డుపై వరద ప్రవాహం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.
 
దీని ఫలితంగా ప్రఖ్యాత గండి పోచమ్మ ఆలయం వైపు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని వలన యాత్రికులు, స్థానిక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
 
కాగా.. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుండి 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.