1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2016 (11:36 IST)

పవన్ ఫ్యాన్ వినోద్ హత్య.. సందిగ్ధంలో పడిన జూనియర్ ఎన్టీఆర్.. జనతా గ్యారేజ్‌పై..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని వినోద్ హత్యకు గురవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అతను మరణించేందుకు ముందు.. ట్విట్టర్లో చేసిన పోస్ట్ అందరి మనస్సులను కదిలించి వేసింది. పవన్ ఫ్యాన్ వినోద

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని వినోద్ హత్యకు గురవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అతను మరణించేందుకు ముందు.. ట్విట్టర్లో చేసిన పోస్ట్ అందరి మనస్సులను కదిలించి వేసింది. పవన్ ఫ్యాన్ వినోద్ రాయల్ కర్ణాటకలోని కోలార్‌కు వెళ్తున్న సమయంలో పెట్టిన చివరి పోస్ట్ పవన్ ఫ్యాన్స్‌ని కదిలిస్తోంది.

ఆ పోస్ట్‌లో ఏముందంటే.. అవయవదానంపై అందరికీ అవగాహన కల్పించడం కోసం కోలార్‌లో జరిగే కార్యక్రమానికి పవన్ ఫ్యాన్స్ కూడా వెళ్తున్నాం అని ఉంది. మేము కేవలం పవన్ అభిమానులం మాత్రమే కాదు ఆయన ఆలోచనా విధానాన్ని అనుసరించే వాళ్ళం కూడా..'' అంటూ పోస్ట్ పెట్టాడు. అవయవ దానం కోసం విస్తృత ప్రచారం చేయాలనీ భావించిన వినోద్ చిన్న వివాదం కారణంగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడిపెట్టేలా చేసింది.
 
ఇదిలా ఉంటే.. వినోద్ హత్యోదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిధి దాటి జాతీయ మీడియాలో చర్చ వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో వినోద్ రాయల్ హత్యోదంతం ట్రెండింగ్ టాపిక్‌గా మారి పోయింది. ఇక ఈ సంఘటనతో ఎన్టీఆర్ చిక్కుల్లో పడ్డారు. హత్యోదంతంపై స్పందించి తిరుపతికి వెళ్ళినా ఉద్రిక్త పరిస్థితులే నెలకొంటాయి. 
 
తన అభిమాని అని చెప్పుకునే వ్యక్తి ఒక నేరం చేస్తే దానికి అసలేవిధంగా సమాధానం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఎన్టీఆర్ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఫ్యాన్స్ అంటూ బ్రేకింగ్ న్యూస్‌లని టెలికాస్ట్ చేయటంతో ఎన్టీఆర్ తలపట్టుకుని కూర్చున్నాడు.

ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. జనతా గ్యారేజ్ రిలీజ్ కానున్న తరుణంలో పవన్ ఫ్యాన్‌ను ఎన్టీఆర్ ఫ్యాన్ హత్యచేశాడని వార్తలు రావడం సినిమాకు మైనస్సే అవుతుందని సినీ పండితులు అంటున్నారు. మరి ఎన్టీఆర్ ఏం చేస్తారో వేచి చూడాలి.