శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (15:38 IST)

పవన్ కల్యాణ్ కామ్‌గా లేడండోయ్.. మంచి టైమ్ కోసం..?!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా... రైతు భూములు రాజధాని కోసం చేతులు మారుతున్నా.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరెత్తట్లేదో అర్థం కావట్లేదని అందరూ చర్చించుకుంటుంటే.. ఒక వర్గం మాత్రం పవన్ కల్యాణ్ కామ్‌గా లేదండోయ్.. మంచి సమయం కోసం వేచి చూస్తున్నాడని అంటున్నారు. 
 
పవన్ చెప్పడంతోనే టీడీపీ ఓటేశామని.. రైతుల బాధేంటో పవన్ తెలుసుకుని సర్కారుతో మాట్లాడాలని... అలాగే ఆర్థిక బడ్జెట్‌లో కేంద్రం ఏపీకి చేసిన అన్యాయంపై కూడా పవన్ కల్యాణ్ సీన్లోకి వచ్చి గళమెత్తాలని ఆయన అభిమానులు, ప్రజలు, రైతులు ఆశిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం నోరెత్తక సైలెంట్‌గా ఉండటం ఎందుకోనని అందరూ ఆలోచిస్తుంటే.. పవన్ తప్పకుండా ఏపీ స్పెషల్ స్టేటస్‌తో పాటు అన్నీ అంశాలపై టీడీపీ, బీజేపీలను ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నాడని.. కానీ అందుకు తగిన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందులో భాగంగా ఏపీ క్యాపిటల్ ఏర్పాటు కానున్న తుళ్లూరులో పవన్ గురువారం నుంచి పర్యటిస్తారని.. ఈ సందర్భంగా టీడీపీ-బీజేపీలను ఎండగడతారని అందరూ ఆశిస్తున్నారు. మరి పవన్ ఏ మేరకు స్పందిస్తారో.. రైతులను ఎలా ఒప్పిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.