గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జులై 2019 (12:57 IST)

రైతు రుణమాఫీ కోరుతూ హైకోర్టులో పిల్

రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగు, ఐదు విడతలుగా బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ చైర్మన్ జెట్టి గురునాథ రావు రాష్ట్ర హైకోర్టులో ఓ పిల్‌ను సోమవారం దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ యం. సత్యనారాయణమూర్తి ముందు 65 ఐటెంగా విచారణకు రానుంది.
 
 రైతు రుణ మాఫీ నాలుగు, ఐదు విడతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో.38ను (10 మార్చి 2019)అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 
 
అలాగే, నాలుగు, ఐదు విడతల రైతు రుణ మాఫీ సొమ్మును 30 లక్షలను రైతుల ఖాతాలో జమచేయాలని ఆదేశించాలని పిల్‌లో కిసాన్ సెల్ ఛైర్మెన్ జెట్టి గురునాథ రావు కోరారు.