గుంటూరులో విషాదం : తల్లి అంత్యక్రియలకు వెళుతూ నీటిలో గల్లంతు!
గుంటూరు జిల్లా గురజాల మండలంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తల్లి అంత్యక్రియలు బయలుదేరిన ఇద్దరు మహిళలు ఎద్దువాగు నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయారు. శనివారం గురజాల మండలం మాడ్గుల సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనసూయ, రాధ అనే ఇద్దరు మహిళలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో ఓ మహిళ మృతదేహం లభించగా, మరో మహిళ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పటిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గుంటూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. తల్లి అంత్యక్రియల కోసం అనసూయ, రాధలు ఎద్దువాగు దాటేందుకు యత్నించారు. నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో వారు కొట్టుకుపోయారు.