గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (17:30 IST)

పురుడు పోసుకోకముందే రజినీ పార్టీ విలీనం?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దక్షిణాదిలోనేకాకుండా దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. పైగా, ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని ప్రతి ఒక్కరూ భావిం

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దక్షిణాదిలోనేకాకుండా దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. పైగా, ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని ప్రతి ఒక్కరూ భావించారు. అలాంటి పరిస్థితుల్లో రజినీ మక్కల్ మండ్రం పేరుతో ఆయన ఓ పార్టీని స్థాపించారు. ఇందులో చేరేందుకు ఆయన అభిమానులు క్యూ కట్టారు.
 
ఇంతలోనే ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో పురుడు పోసుకోకముందే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడానికి రజినీ రెడీ అవుతున్నారంటూ ఓ వార్తా కథనం జాతీయ మీడియాలో జోరుగా ప్రసారమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. ఢిల్లీ వేదికగా ఇప్పటికే ఏడు సార్లు ఇద్దరూ కలిసి చర్చించినట్టు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిలో అనేక సందేహాలున్నప్పటికీ... ఈ విషయాన్ని రజినీ ఫ్యాన్స్... అందునా తమిళులు ఎంతగా స్వాగతిస్తారో వేచిచూడాల్సిందే.