గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (10:54 IST)

రక్షాబంధన్ : తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు...

రక్షా బంధన్ ఓ ఇంట అంతులేని శోకాన్ని మిగిల్చింది. రాఖీ పండుగ రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సోదరుడు కన్నుమూశాడు. దీంతో తీవ్ర విషాదంలోనూ అన్న మృతదేహానికి చెల్లెలు రాఖీ కట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చ

రక్షా బంధన్ ఓ ఇంట అంతులేని శోకాన్ని మిగిల్చింది. రాఖీ పండుగ రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సోదరుడు కన్నుమూశాడు. దీంతో తీవ్ర విషాదంలోనూ అన్న మృతదేహానికి చెల్లెలు రాఖీ కట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొక్కొండ వినోద్‌ (22) అనే యువకుడు తన మిత్రులు కొందరితో కలిసి స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఆదివారం సాయంత్రం సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్దకు కారులో వచ్చారు. అయితే, చెరువు గట్టుపై కారు వెళుతుండగా, అదుపుతప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వినోద్ చనిపోయాడు. అతని మృతదేహం కోసం జాలర్లు గాలించి సోమవారం వెలికితీశారు. 
 
అతడి శవాన్ని చూడడంతోనే తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల శోకం మిన్నంటింది. రాఖీ పండగ కావడంతో అతని సోదరి శిరీష తీరని దుఃఖంతో విలపిస్తూనే వినోద్‌ మృతదేహానికి రాఖీ కట్టడం అక్కడున్న కంటతడిపెట్టించింది. వినోద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.