1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:10 IST)

19న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి

రథసప్తమి సంబంధించి భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా 25 వేల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టిటిడి విడుదల చేయనుంది. గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేసింది.
 
అదేవిధంగా, ఫిబ్రవరి నెలలో మిగిలిన రోజులకు సంబంధించి రోజుకు 5 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టిటిడి అదనంగా ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది.
 
 ఈ టికెట్లు కూడా ఫిబ్రవరి 11న గురువారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది. ప్రస్తుతం 300రుపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రోజుకు 20 వేలు ఉండగా, ఈ కోటా 25 వేలకు పెంచింది.