విజయవాడలో సచిన్, అనుష్క... పీవీపి స్క్వేర్ లాంఛ్
విజయవాడలోని ఎం.జి. రోడ్లోని పివీపీ స్క్వేర్ను శుక్రవారం నాడు సచిన్ టెండూల్కర్ ప్రారంభించారు. అనుష్క ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పివీపీ బేనర్పై 'బలుపు' చిత్రాన్ని నిర్మించిన పొట్లూరి వి.ప్రసాద్ తొలిసారిగా విజయవాడలో మల్టీప్లెక్స్ థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మించారు. గత కొద్దిరోజులుగా సచిన్ వస్తున్నాడనే ప్రచారంతో విజయవాడలో యూత్ బాగా హాజరయ్యారు. ఓ దశలో వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ... విజయవాడ అంటే తనకిష్టమనీ.. ఇక్కడి వారంతా తనపై చూపిస్తున్న ఆదరణకు ఆనందమేస్తుందని అన్నారు. అనుష్క కూడా కొద్దిగా మాట్లాడి.. ప్రసాద్గారి ఎంటర్టైన్మెంట్ రంగంలో మరింత ముందుగా సాగాలని కోరింది. పివీపీ... మొన్న విజయవాడ ఎం.పి. సీటును ఆశించి చివర్లో భంగపడ్డారు.