1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2024 (09:18 IST)

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం..

pawan - sankranti - babu
కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే అభ్యర్థుల తరపున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారు.
 
స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని పెడనలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు మచిలీపట్నంలోని కోనేరు సెంటర్‌లో వారాహి విజయభేరి సభ జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు బుధవారం సాయంత్రం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి పెడనకు ప్రత్యక హెలికాప్టర్‌లో రానున్నారు. నాలుగు గంటలకు పెడన బస్ స్టాండ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మచిలీపట్నంకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మచిలీపట్నంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.