1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:19 IST)

మద్దెలచెర్వు సూరి హత్య కేసు : పరిటాల రవి ఫ్యామిలీ హస్తం? నేడు తీర్పు

అనంతపురం జిల్లాకు చెందిన గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు మంగళవారం తుదితీర్పును వెలువరించనుంది. ఈ హత్య కేసులో టీడీపీ నేత దివంగత పరిటాల రవి కుటుంబం హస్తం ఉందని హతుని భార్య గంగుల భానుమతి ఆరోపిస్తూవస్తోంది. ఈ క్రమంలో సూరి హత్య కేసులో తుది తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది. 
 
కాగా, 2011, జనవరి 3వ తేదీన సూరి, అతడి ప్రధాన అనుచరుడు, అల్లుడుగా భావిస్తూ వచ్చిన భానుకిరణ్, డ్రైవర్ మధులు జూబ్లీహిల్స్ నుంచి సనత్ నగర్ వైపు కారులో వెళుతున్నారు. అపుడు కొందరు పాయింట్ బ్లాంక్‌లో సూరిపై కాల్పులు జరిపి హతమార్చారు. 
 
ఈ కేసులో భూనుకిరణ్ ప్రధాన నిందితుడుగా పోలీసులు తేల్చారు. అలాగే, డ్రైవర్ మధు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు విచారణ సాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పలువురు వాంగ్మూలంతోపాటు ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. ఈ కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించనుంది.