గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (20:51 IST)

మనీ ఇస్తావా... ఇచ్చేంతవరకూ కోర్కె తీర్చుతావా? మహిళకు వేధింపులు, పీఎస్ ముందు...

నంద్యాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద నాగ‌మ‌ణి అనే మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇంత‌కీ నాగ‌మ‌ణి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కార‌ణం ఏంటంటే... దేవనగర్‌కు చెందిన కాల్ మనీ నిర్వహకుడి వేధింపులు

నంద్యాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద నాగ‌మ‌ణి అనే మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇంత‌కీ నాగ‌మ‌ణి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కార‌ణం ఏంటంటే... దేవనగర్‌కు చెందిన కాల్ మనీ నిర్వహకుడి వేధింపులు తాళలేక నాగమణి ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేసింద‌ట‌. అప్పు.. వడ్డీ కట్టక‌పోవ‌డంతో అప్పు ఇచ్చిన వ్యక్తి తన కోరిక తీర్చాలని అసభ్యకరమైన మెసేజ్‌లు ఫోన్లు చేసేవాడ‌ట‌.
 
తనకు జరిగిన అన్యాయాన్ని రెండు రోజుల క్రితమే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింద‌ట‌. అయినా.. స్పందించ‌క‌పోవ‌డంతో నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని కంప్లైంట్ రాస్తూ స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది నాగమ‌ణి. ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చార‌ు‌. ఆమె ప‌రిస్థితి మాత్రం విష‌మంగానే ఉన్న‌ట్టు స‌మాచారం.