శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (12:10 IST)

అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు.. కలిసి జీవించాలనుకున్నారు.. కానీ?

అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అయితే వరుసలు కలవకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో విడిపోలేక ఆ అన్నాచెల్లెళ్లు పురుగుల మందు తాగారు. ఇందులో ఒకరు మృ

అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అయితే వరుసలు కలవకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో విడిపోలేక ఆ అన్నాచెల్లెళ్లు పురుగుల మందు తాగారు. ఇందులో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడుగులపల్లి గ్రామానికి చెందిన చిందాల గిరి(20), చిందాల మౌనిక(20) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు.
 
అయితే వరుసకు వీరద్దరు అన్నా చెల్లెళ్లు కావడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లి అడ్డుపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమ జంట.. కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగుల మందు తాగేశారు. ఈ ఘటనలో గిరి ప్రాణాలు కోల్పోగా, మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.