శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (15:06 IST)

కాపు ప్రజలను అలజడికి గురిచేస్తున్న ముద్రగడ : ఎమ్మెల్సీ సోమిరెడ్డి

రిజర్వేషన్ల విషయంలో ముద్రగడ చిరంజీవి, బొత్స, రఘువీరాలను మద్దతు కోరడం ఎక్కడా లేని విడ్డూరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ ముద్రగడ వ్యాఖ్యలు కాపులలో గందరగోళాన్ని రేపుతోందన్నారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తారని, అంతమాత్రాన ముద్రగడ రాద్ధాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అమరాతికి అడ్డుపడుతోంది వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డేనని, ఆయన వల్ల అమరావతి నిర్మాణం ఆలస్యమవుతోందని సోమిరెడ్డి ఆరోపించారు. 
 
ముద్రగడ చేష్టలతో కాపులు అయోమయంతో పడ్డారు : రామానుజులు 
కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేష్టలతో కాపులే అయోమయంలో పడిపోయారని కాపు కార్పొరేషన్‌ అధ్యక్షుడు రామానుజులు అన్నారు. కాపులకు ఏదో చేస్తానని, ముద్రగడ తిరుగుతుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి దోహదపడాల్సిన ముద్రగడ ఆ విషయాన్ని పక్కనబెట్టి జగన్‌తో లాలూచీ పడ్డారని ఆరోపించారు.