1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (20:54 IST)

త్వరలో గూడూరు-విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభం

దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సులువుగా చేరేందుకు వీలుగా, గూడూరు-విజయవాడ-గూడూరు మధ్య నూతన ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు చేసిన సూచనకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. 
 
రైల్వేబోర్డు ఆదేశించిన మేరకు రైలు నంబరు 12743 గూడూరు-విజయవాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, ప్రతిరోజూ గూడూరు నుండి ఉదయం 06:10 గంటలకు బయలుదేరి, విజయవాడకు ఉదయం 10:40 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 12744 విజయవాడ-గూడూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, విజయవాడ నుండి ప్రతిరోజూ సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరి, గూడూరుకు రాత్రి 10:30 గంటలకు చేరుతుంది.

మార్గమధ్యంలో ఈ రైలు నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, మరియు తెనాలి రైల్వేస్టేషన్లలో ఆగనున్నది. ఈ రైలు రెండు ఏసి చైర్ కార్, పది నాన్ ఏసి చైర్ కార్, రెండు పవర్ కార్ బోగీలతో మొత్తం పద్నాలుగు బోగీలతో నడవనున్నది. ఈ నూతన రైలుకు సంబంధించిన అధునాతన LHB బోగీలు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నందున, అతి త్వరలో ఈ రైలు ప్రారంభం .