గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జులై 2018 (15:21 IST)

పాలిటెక్నిక్ విద్యార్థినిపై మందుబాబుల అత్యాచారం... ఎక్కడ?

విజయవాడలో దారుణం జరిగింది. పాలిటెక్నిక్ విద్యను పూర్తిచేసి ఇంటివద్దనే ఉన్న విద్యార్థినిపై నలుగురు మందుబాబులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం నగర శివారు ప్రాంతంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

విజయవాడలో దారుణం జరిగింది. పాలిటెక్నిక్ విద్యను పూర్తిచేసి ఇంటివద్దనే ఉన్న విద్యార్థినిపై నలుగురు మందుబాబులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం నగర శివారు ప్రాంతంలో జరిగింది.


ఈ వివరాలను పరిశీలిస్తే... విజయవాడ నగరానికి చెందిన ఓ యువతి పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేసి ఇంటివద్దనే ఉంది. ఈ యువ స్నేహితుడు ఈమెను పార్టీకని ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు. ఆ తర్వాత ఆమెకిచ్చిన కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి.. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడకు తన ముగ్గురు స్నేహితులను రప్పించి ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే,  యువతితోపాటు ఆమె సహచర విద్యార్థులుగా చెబుతున్న మరికొందరు యువకులు అక్కడే ఉండటాన్ని స్థానికులు గమనించారు. 
 
దీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు యువతితో పాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, పోలీసులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలను తావిస్తోంది.