1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 మార్చి 2024 (10:26 IST)

నారా లోకేశ్‌కు జడ్ కేటగిరీ భద్రత : కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ

nara lokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర హోం శాఖ జడ్ కేటగిరీ భద్రత కల్పించింది. లోకేశ్ యువగళం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టులు హెచ్చరికలు, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్ వీఐపీ వింగ్ భద్రతా సిబ్బందితో జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తారు. మొత్తం 22 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. వీరిలో నలుగురైదురుగు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండోలు కూడా ఉంటారు. 
 
ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్‌కు భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ జడ్ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను పక్కనపెట్టేసి, వై కేటగిరీ భద్రతను కల్పించింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని గతంలో లోకేశ్‌కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ హోంశాఖలకు లేఖలు రాశారు.