శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (10:34 IST)

ప్రేమించలేదని కూరలు తరిగే కత్తితో నరికేశాడు... యువతి ప్రాణం తీసిన ఉన్మాది

ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని ఓ యువతి తలను నరికేశాడు. కూరగాయలు కోసే కత్తితో ఈ దారుణానికి తెగబడ్డాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారంలో జరిగింది. ఈ వివ

ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని ఓ యువతి తలను నరికేశాడు. కూరగాయలు కోసే కత్తితో ఈ దారుణానికి తెగబడ్డాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తారకేశ్వరరావు అనే వ్యక్తి 20 యేళ్ళ క్రితం కుటుంబంతో కలిసి ఉపాధి కోసం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం వచ్చారు. ఇక్కడే వినాయకనగర్‌లో ఉంటూ స్థానిక పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరి ఇంటికి ఎదురుగా మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం నివాసముంటోంది. 
 
తారకేశ్వరరావుకు నికిత అనే 17 యేళ్ల కుమార్తె ఉంది. ఈమె స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతోంది. ఇంటికి ఎదురుగా ఉన్న మహారాష్ట్ర కుటుంబానికి చెందిన ఓ యువకుడు నికితను గత రెండేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే, అతని ప్రేమను నికిత తిరస్కరించింది. 
 
ఈనేపథ్యంలో గురువారం సాయంత్రం నికిత స్కూల్‌ నుంచి రాగానే.. సోను ఇంట్లోకి చొరబడి కూరగాయలు తరిగే కత్తితో ఆమె గొంతుకోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా.. బయటికి వచ్చిన సోను తీరిగ్గా ఇంటి బయట కూర్చున్నాడు. 
 
ఇంట్లో జరిగిన ఘోరాన్ని చూసి బెదిరిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు... రక్తపు మడుగులో పడివున్న నికితను ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.