గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:54 IST)

ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన మేకలు.. ఫైన్ వేసిన పోలీసులు.. ఎలా.. ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో రెండు మేకలకు పోలీసులు జరిమానా విధించారు. ఈ మేకలు చేసిన నేరమేంటో తెలుసా? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు. ఇంతకు ఆ మేకలు ప్రభుత్వ ఆస్తులను ఎలా ధ్వంసం చేశాయో తెలుసుకుందాం. 
 
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో స్థానికంగా పని చేసే సేవ్ ది ట్రీస్ అనే ఓ ఎన్జీవో సంస్థ సుమారుగా వెయ్యి మొక్కలను నాటింది. అయితే, అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రెండు మేకలు ఆ మొక్కల్లో 280 నుంచి 300 మొక్కలను మేశాయి. వీటిలో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. అంటే ఈ మొక్కలను ప్రభుత్వ ఆస్తులుగా పోలీసులు పరిగణించారు. 
 
ఈ నేపథ్యంలో మొక్కలను తినేస్తున్న రెండు మేకలను ఎన్జీవో సభ్యులు పట్టుకెళ్లి పోలీసు అధికారులకు అప్పగించారు. దీంతో తన మేకలు కనిపించకపోవడంతో వాటి యజమాని రాజయ్య స్టేషన్‌కు రాగా, పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ మొత్తం జరిమానా కట్టిన సదరు యజమాని, తన మేకలను విడిపించుకుని వెళ్లారు. మొత్తంమీద ఈ సంఘటన స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేసింది.