శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:01 IST)

తితిదే బోర్డులో తెలంగాణ తమ్ముళ్లకు పదవులెందుకివ్వాలి...?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి కొత్త తలనొప్పి ఒకటి వచ్చిపడంది. అదేమిటయా అంటే, టిడిడి బోర్డులో సభ్యుల నియామకం. తితిదే పాలకమండలిలో ప్రభుత్వం తన ఇష్టం వచ్చినవారికి పదవులను కట్టబెడుతుంది. కానీ ఈ పదవుల్లో తమను కూడా భాగస్వామ్యం చేయాలని తెలంగాణాకు చెందిన తెలుగు తమ్ముళ్లు పట్టుబట్టినట్లు చెపుతున్నారు. 
 
చంద్రబాబు నాయుడు కూడా టి.తమ్ముళ్లు తెలంగాణలో చాలా కష్టాలు పడుతున్నారు కనుక వారు అడిగినట్లు ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెదేపా తమ్ముళ్లు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. తెలంగాణ వారికి ఇక్కడ పదవులేమిటి అని ప్రశ్నిస్తున్నారట. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ఒక్కరు చొప్పున ఇచ్చినట్లే తెలంగాణ నుంచి ఒక్కరికే అవకాశం ఇవ్వాలని అంటున్నారట. దీంతో చంద్రబాబు అయోమయంలో పడిపోయినట్లు చెపుతున్నారు.