శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 15 మే 2017 (08:20 IST)

ఇక ఎమ్మెల్యేలు.. ఎంపీలకు చంద్రబాబు పదవులు ఇవ్వనన్నారు... ఎంపీ మురళీమోహన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ఆశపడ్డారు. ఆ వెంటనే తన మనసులోని మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడ

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ఆశపడ్డారు. ఆ వెంటనే తన మనసులోని మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, నాలుగు హితవచనాలు చెప్పి పంపారు. పొద్దస్తమానం పదవులపై ధ్యాసేనా.. రాష్ట్రాభివృద్ధిపై కాస్తైనా మనస్సు పెట్టండంటూ సుతిమెత్తగా హెచ్చరించినట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని మురళీమోహనే స్వయంగా వెల్లడించారు. అడిగిన వారందరికీ పదవులు ఇచ్చుకుంటూ వెళ్తే రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టలేనని చంద్రబాబు అన్నారని చెప్పారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎంపీలకూ పదవులు ఇవ్వదలచుకోలేదని సీఎం స్పష్టంగా చెప్పారని తెలిపారు. 
 
అయితే, తితిదే ఛైర్మన్ కుర్చీపై ఆశపడటానికి ఓ కారణం ఉందన్నారు. తనకు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ.. చిన్ననాటి నుంచి టీటీడీ చైర్మన్ పదవి చేయాలని కోరిక ఉందని, అందుకే తన మనస్సులోని మాటను చంద్రబాబుకు చెప్పానని సినీ నటుడు వివరించారు.