1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జులై 2020 (07:13 IST)

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తొలి అడుగు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తొలి అడుగు పడింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సీఎస్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఆ వివరాలు...
 
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం – నిర్ణయాలు:
 
1. మరింత మందికి వైయస్సార్‌ చేయూత, కేబినెట్‌ కీలక నిర్ణయం. ఇప్పటికే పెన్షన్‌ అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులైన మహిళలు తదితర కేటగిరీ మహిళలకూ చేయూత వర్తింపు కేబినెట్‌ నిర్ణయం వల్ల ఇప్పటికే పెన్షన్‌ అందుకుంటున్నవారిలో అదనంగా రూ. 8.21 లక్షలమందికి లబ్ధి జరుగుతుందని అంచనా
వీరుకాక వైయస్సార్‌ చేయూత కోసం ఇప్పటివరకూ 17.03 లక్షల మంది దరఖాస్తు.
 
వైయస్సార్‌ చేయూత కింద 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో నాలుగు విడతల్లో రూ. 75వేల రూపాయలు అందించనున్న ప్రభుత్వం. ఏడాదికి రూ.1540.89 కోట్ల చొప్పున నాలుగేళ్లకు సుమారు రూ.6163.59  కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మహిళల ఉపాధి, జీవన ప్రమాణాలను పెంచడంలో ఈ స్కీం ఉపయోగపడుతుందన్న ప్రభుత్వం
 
2. నాడు – నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించి జీఓ ఎంఎస్‌ 22కు కేబినెట్‌ ఆమోదం. మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లు, కాలేజీల్లో నాడు –నేడు కింద అభివృద్ధి పనులు.
 
3. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌లో 28 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం. 13 పోస్టులు డిప్యుటేషన్‌ ప్రాతిపదికన, 1 కాంట్రాక్టు ప్రాతిపదికన, 14 పోస్టులు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో మంజూరు
 
4. జిల్లా పునర్‌వ్యవస్థీకరణపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేయనున్న కమిటీ. జిల్లాల ఏర్పాటులో ఖర్చును నియంత్రించడం సహా వివిధ అంశాలను అధ్యయనం చేయనున్న కమిటీ. చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు. సభ్యులుగా సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ. వీలైనంత త్వరలో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశం.

మానవవనరులను వీలైనంత సమర్థవంతగా వినియోగించుకోవడం, మౌళికసదుపాయాలను వినియోగించుకోవడం ఉద్దేశం. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు నేపథ్యంలో ఈ పునర్‌వ్యవస్థీకరణ అవసరమని భావించిన మంత్రివర్గం. అంతేకాక జిల్లాలు పెద్దవిగా ఉండడంతోపాటు, జనాభాకూడా అధికంగా ఉండడం కూడా కారణంగా పేర్కొన్న మంత్రివర్గం. పాలనా సౌలభ్యంతోపాటు, ప్రజలకు వీలైనంత చేరువగా ఉండేందుకు దోహదపడుతుందని పేర్కొన్న మంత్రివర్గం.
 
5. 10వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు. దీనికోసం ఏపీ అగ్రికల్యర్‌ ల్యాండ్‌ యాక్ట్‌ –2006 ( కన్వర్షన్‌ ఫర్‌ నాన్‌ అగ్రికల్చర్‌ పర్పస్‌) సవరణకు కేబినెట్‌ ఆమోదం దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలని నిర్ణయం
 
6. రెన్యుబుల్‌ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ విధానం–2020 కి కేబినెట్‌ ఆమోదం. రాష్ట్రం వెలుపల రెన్యుబుల్‌ ఎనర్జీ ఎగుమతికి వీలుగా విధానం. సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తి, ఆ ప్రాజెక్టులకు ప్రోత్సాహించే దిశగా ప్రభుత్వం చర్యలు. ఈ రంగంలో మరింత మంది పెట్టుబడి దారులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు.
 
7. 10వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం. రైతులకు పగిటిపూట ఉచిత కరెంటు ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ కీలక ప్రాజెక్టులను తీసుకొస్తున్న ప్రభుత్వం. తక్కువ ఖర్చుకు కరెంటు వచ్చేలా, వీలైనంత ప్రభుత్వంమీద ఆర్థిక భారం తగ్గేలా ఒప్పందానికి ఆమోదం, 25 ఏళ్లకు పీపీఏ కుదుర్చుకోవాలని నిర్ణయం.
 
8. రాయలసీమ ప్రాజెక్టుల సామర్థ్యంపెంపు, కాల్వల విస్తరణ పనులకోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌కు కేబినెట్‌ ఆమోదం
దీనికోసం ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ కరువు నివారణా ప్రాజెక్ట్స్, డెవలప్‌మెంట్‌  కార్పొరేషన్‌ (ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్‌)కు కేబినెట్‌ అంగీకారం.

100 శాతం ప్రభుత్వం కంపెనీగా వ్యవహరించనున్న ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్‌ క్యాపిటల్‌ అవుట్‌ లే రూ. 40వేల కోట్లు
ఈ డబ్బుతో వరద వచ్చే కాలంలోనే నీటిని తాగు, సాగునీటి కొరతతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడానికి పనులు చేపట్టనున్న ప్రభుత్వం
 
9. గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.145.94 కోట్ల రూపాయలను విడుదల, దీనికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం. గండికోటలో 27 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు సత్వర చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.
 
10. రూ.2వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ అనుమతి.
 
11. ఏపీ స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్‌కు డైరెక్టర్‌ పోస్టు మంజూరుచేస్తూ కేబినెట్‌ నిర్ణయం.
 
12. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలకు పోస్టులు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం. ఇందులో 210 టీచింగ్, 89 నాన్‌ టీచింగ్‌ పోస్టులు శ్రీకాకుళానికీ, 210 టీచింగ్, 89 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఒంగోలుకు మంజూరు.
 
13. గుంటూరులో ముస్లిం యువకులపై పెట్టిన కేసులు ఉపసంహరణకు కేబినెట్‌ ఆమోదం. 
 
14. 31 స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్ల పోస్టులను అసిస్టెంట్‌ డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్లుగా అప్‌గ్రేడ్‌కు కేబినెట్‌ ఆమోదం.
 
15. సీపీఎస్‌ ఉద్యమంలో భాగంగా టీచర్లు, ఇతర ఉద్యోగలుపై పెట్టిన కేసులను ఉప సంహరించాలని కేబినెట్‌ నిర్ణయం.
 
16. సీఐడీలో 10 జూనియర్‌ అసిస్టెంట్లు, 10 స్టెనో పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.
 
17. ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్‌ –2020 కి కేబినెట్‌ ఆమోదం. దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకు రానున్న ప్రభుత్వం. ఆక్వారైతులకు నకిలీ ఫీడ్‌ల బెడదనుంచి విముక్తి. ఈ యాక్ట్‌ ద్వారా అనైతిక చర్యలకు అడ్డుకట్ట వేసేదిశగా చర్యలు. ఆక్వాసాగులో 60శాతం నిర్వహణ ఖర్చులు ఫీడ్‌ ద్వారానే.

రాష్ట్రంలో దాదాపు రూ. 17వేల కోట్ల విలువైన ఫీడ్‌ బిజినెస్‌. తయారీ దారులు సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో నష్టపోతున్న ఆక్వా రైతులు. వీరిపై నియంత్రణ, పర్యవేక్షణకు వీలు కల్పిస్తున్న చట్టం. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా నిబంధనలను తీసుకు రానున్న చట్టం. ప్రత్యేక లేబొరొటరీల ద్వారా ఎప్పటికప్పుడు నాణ్యతను పర్యవేక్షించనున్న ప్రభుత్వం.
 
18. కపడజిల్లా  వెంకటంపల్లెలో వైయస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ కింద ఉన్న అరటి పరిశోధనా సంస్థలో 11 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ అంగీకారం. ఇందులో 5 టీచింగ్‌ పోస్టులు, 6 నాన్‌ టీచింగ్‌ పోస్టులు
 
19. కర్నూలు జిల్లా ప్యాపిలిలో రూ. 5 కోట్లతో గొర్రెల పెంపకందార్ల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
అనంతపురం జిల్లాలో మరో గొర్రెల పెంపకందార్ల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అక్కడికక్కడే కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి.
 
20. కర్నూలు జిల్లా కొమ్మమర్రిలో రూ.9 కోట్లతో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
2020–21 విద్యా సంవత్సరానికి 30 మంది విద్యార్థుల బ్యాచ్‌తో కాలేజీ ఆరంభం. 
 
21. ఆచార్య ఎన్జీరంగా యూనివర్శిటీ గుంటూరులో హోంసైన్స్‌ విభాగంలో 2 ప్రొఫెసర్, 4అసోసియేట్‌ ప్రొఫెసర్ల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం. 
 
22. ఇసుకకు సంబంధించిన వ్యవహారాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. గతంలో ఏపీఎండీసీ కింద ఇసుక కార్పొరేషన్‌. ఏపీఎండీసీకి పనిభారాన్ని తగ్గించేదిశగా ఇసుక కార్పొరేషన్‌. ఇసుక మినహా మిగతా ఖనిజాల వ్యవహారాలన్నీ ఏపీఎండీసీకి. ఇసుక కార్పొరేషన్‌పై ముగ్గురు మంత్రుల కమిటీ పర్యవేక్షణ. ఎప్పటికప్పుడు ఇసుక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ. తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్న మంత్రుల కమిటీ. 
మంత్రుల కమిటీలో కొడాలినాని, పేర్ని నాని,  బుగ్గన రాజేంద్రనాథ్‌. 
 
23. దేశ చరిత్రలోనే తొలిసారి భారీ ఎత్తున వైద్యుల పోస్టుల నియామకాలకు ఆమోదం. ఇంత పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేయడం ఇదే ప్రథమం. 9712 పోస్టుల భర్తీకి నిర్ణయం. 5701 కొత్త పోస్టుల భర్తీతోపాటు చాలా కాలంగా భర్తీ కాకుండా ఉన్న 4011 పోస్టులనూ భర్తీ చేయాలని నిర్ణయం.