శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 31 జులై 2017 (14:26 IST)

బిచ్చగాళ్లకు బ్యాంకు ఖాతాలు... ఏటీఎం కార్డుతో నగదు చోరీ.. ఎలా?

హైదరాబాద్ నగరంలో అనేక మంది బిచ్చగాళ్లకు బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు వెలుగుచూసింది. ఈ ఖాతాలకు జారీ అయిన ఏటీఎం కార్డులతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇంతకీ ఈ పని చేస్తున్నది ఎవరో కాదు.. సైబర్ నేరగాళ్లు. స

హైదరాబాద్ నగరంలో అనేక మంది బిచ్చగాళ్లకు బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు వెలుగుచూసింది. ఈ ఖాతాలకు జారీ అయిన ఏటీఎం కార్డులతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇంతకీ ఈ పని చేస్తున్నది ఎవరో కాదు.. సైబర్ నేరగాళ్లు. సిటీలోని బిచ్చగాళ్ళకు డబ్బులు ఎరచూపి వారి పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. ఆ తర్వాత ఆ ఖాతాలకు బ్యాంకు ఇచ్చే ఏటీఎం కార్డుతో ఇతర ఖాతాదారుల నగదును దోచుకుంటున్నారు. ఇలా సైబర్ నేరగాళ్ల గుట్టును రాచకొండ సైబర్ క్రైం పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. ఫుట్‌పాత్‌లపై ఉండే వారిని, బిచ్చగాళ్లను సైబర్ క్రిమినల్స్ ఎంచుకుని వారికి రూ.2 వేలు ఆర్థికసహాయం కింద అందిస్తున్నారు. ఆ తర్వాత వారి ఫొటోలను తీసుకుని, ప్రధాన నగరాల్లో ఉండే బస్తీల్లో ఓ గదిని అద్దెకు తీసుకుంటున్నారు. ఆ గది చిరునామాతో బిచ్చగాళ్ల ఫొటోలు పెట్టి బ్యాంకుల్లో ఖాతాలను తెరుస్తున్నారు. ఏటీఎం కార్డు, చెక్‌బుక్కులు వచ్చే వరకు ఆ గదిలో ఉండి, అవి చేతికి అందగానే ఖాళీ చేసి వెళ్లిపోతారు. 
 
ఆన్‌లైన్ మోసం చేసిన తర్వాత ఈ బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు కేవలం 15 నిమిషాల్లో వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా డబ్బును డ్రా చేసేస్తున్నారు. పోలీసులకు బ్యాంకు ఖాతా వివరాలు తెలిసినా ఎక్కడా సరైన ఆచూకీ దొరకదు. ఒకవేళ దొరికినా ఆ చిరునామాలో వారు ఉండరు. బ్యాంకు ఖాతా ఫొటోతో గుర్తుపడుదామనుకున్నా ఫొటోలో ఉన్న వ్యక్తులు బిచ్చగాళ్లు కావడంతో ఏమీ చేయలేకపోతున్నట్టు పోలీసులు విచారణలో తేలింది.