శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (11:51 IST)

కవితకు కష్టాలు : బీజేపీ కన్వీనర్ కాశింశెట్టి కేసు

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు కష్టాలొచ్చిపడ్డాయి. తెలంగాణ, జమ్మూకాశ్మీర్‌ల గురించి కవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. భారతదేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత తెలంగాణ, జమ్మూకాశ్మీర్‌లను బలవంతంగా ఇండియన్ యూనియన్‌లో కలిపారంటూ అనుచితంగా ఎంపీ కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో కవిత ఐపీసీ సెక్షన్ 124(ఎ), 153(బి), 505ల కింద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ లీగల్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కాశింశెట్టి కరుణాసాగర్ హైదరాబాద్‌లోని ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, మేజిస్ట్రేట్ ఈ కేసు విచారణను ఆగస్ట్ ఒకటో తేదీకి వాయిదా వేశారు.