శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

భారత ఆహార రంగంలో యూఏఈ పెట్టుబడులు

యూఏఈకి చెందిన సంస్థలు భారత ఆహార రంగంలో 7 బిలియన్​ డాలర్ల మేర పెట్టుబడులు పెడతాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ వెల్లడించారు.

ఎమ్మార్​ గ్రూప్​ నేతృత్వంలోని అక్కడి సంస్థలు వివిధ ప్రాజెక్టుల కింద ఈ మొత్తం వెచ్చించనున్నట్లు తెలిపారు. భారత ఆహార రంగంలో 7 బిలియన్ డాలర్ల మేర యూఏఈకి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

యూఏఈ-భారత్ ఫుడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా వచ్చే మూడేళ్లలో ఈ పెట్టుబడులు ఉంటాయని ఆయన ఓ న్యూస్​ ఛానల్​కు తెలిపారు. దుబాయ్​కి చెందిన ఎమ్మార్ గ్రూప్ నేతృత్వంలోని యూఏఈ సంస్థలు భారత్​లోని వేర్వేరు నగరాల్లో ఉన్న మెగా ఫుడ్ పార్కుల్లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయని పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అగ్రో కమోడిటీస్, సంబంధిత మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తాయని వివరించారు. భారత్​లో పెట్టుబడులు పెట్టే సంస్థల వివరాలను తర్వాత వెల్లడిస్తామన్న ఎమ్మార్ గ్రూపు తాము అన్ని సంస్థల పెట్టుబడులను సమన్వయం చేస్తామని పేర్కొంది.

భారత ప్రభుత్వం పాదుర్​లో ఏర్పాటు చేసిన సమగ్ర పెట్రోలియం నిల్వల కేంద్రం స్ఫూర్తిగా.. యూఏఈ ఆహార భద్రత కోసం ఈ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మార్ సంస్థ వెల్లడించింది. ఆహార రంగంలో యూఏఈ పెట్టే పెట్టుబడులతో భారత రైతుల పంటలకు మెరుగైన ధరలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.