కేంద్రంపై అసంతృప్తి ఉంది.. కానీ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాం : సుజనా చౌదరి
కేంద్రంపై అనేక అంశాలపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి అన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే చాల
కేంద్రంపై అనేక అంశాలపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి అన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే చాలా సాయం అందిందని గుర్తు చేశారు. ఏఏ శాఖలకు ఎంతెంత కేటాయించారో సభలో వివరించాల్సిందిగా పట్టుబడుతామన్నారు.
మరోవైపు కేంద్రం పట్ల కొన్ని విషయాల్లో సంతృప్తి ఉన్నప్పటికీ పలు విషయాల్లో అసంతృప్తి అలాగే ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఏపీ ప్రత్యేక హోదా అంశం ఒకవేళ చర్చకు వస్తే దానిపై అనుసరించాల్సిన వ్యూహాలపై, సభలో ఉంచాల్సిన అంశాలపై తాము చర్చించామన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక హోదా అంశంలో తమపై చేస్తోన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకునే విధంగా తమ పార్టీ కృషి చేస్తోందన్నారు.