1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (12:23 IST)

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతున్న వారిలో నేనూ ఉన్నా : వెంకయ్య నాయుడు

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారనీ, అలా డిమాండ్ చేస్తున్న వారిలో తాను కూడా ఉన్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం లోక్‌సభలో విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిందేనన్నారు. 
 
ఏపీకి రెవెన్యూ లోటు భారీగా ఉందని, అందువల్లే ప్రత్యేక హోదా కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. అలా కోరుతున్నవారిలో తాను కూడా ఉన్నానని స్పష్టం చేశారు. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన సాగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని వెంకయ్య గుర్తు చేశారు. 
 
అంతేకాకుండా, విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడివుందన్నారు. అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాను అడుగుతున్నాయన్నారు. అలాగే, ఇతర రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో పట్టుదలకు పోకుండా, దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.