గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (13:59 IST)

చంద్రబాబు ఓ కెమెడియన్.. ఆ డ్రామా కంపెనీకి డైరెక్టర్‌ ఆయనే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించిన నాటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాజకీయ కమెడియన్ పాత్రను చంద్రబాబు పోషించారని ఎద్దేవా చేశారు.
 
ప్రస్తుతం అదే పాత్రలో చంద్రబాబు మరో హాస్య గుళిక వదిలారంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను గెలిపించింది తానేనని చెప్తూ చంద్రబాబు ఓవరాక్షన్ చేస్తున్నారని.. మీడియా వుందనే విషయాన్ని బాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. అప్పట్లో తన దగ్గర నేర్చుకున్న ఎత్తుగడలతోనే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కూడా చంద్రబాబు ప్రచారం చేసుకుంటారేమో అని విజయసాయి ఎద్దేవా చేశారు. 
 
అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఫైర్ అయ్యారు. రాఫెల్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇకనైనా చంద్రబాబుకు కనువిప్పుకలగాలని విమర్శించారు. రాఫెల్ పిటిషన్ల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ శుక్రవారం ఇచ్చిన తీర్పుపై కన్నా హర్షం వ్యక్తం చేశారు. 
 
తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా కంపెనీ అన్న ఆయన ఆ కంపెనీకి డైరెక్టర్‌ చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి పట్టించుకోవడానికి ప్రజలు సిద్దంగా లేరన్నారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ స్నేహం చేస్తే తెలంగాణలో చేతులు కాలినట్లు మళ్లీ కాల్చుకుంటారన్నారు.