1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (14:19 IST)

పెళ్లైన ఏడు రోజులకే విడిపోయారు.. భార్య చెప్పుతో కొట్టింది.. భర్త ఏం చేశాడంటే?

పెళ్లైన ఏడు రోజులకే విడిపోయారు. అయినా భార్యను వదిలి వుండలేక.. ఆమె వద్దకు వెళ్లి వస్తుండేవాడు భర్త. కానీ పెళ్లైన ఏడు రోజులకే విడిపోయినా.. తరచూ ఇంటికి వచ్చి వెళ్తున్న భర్త వేధింపులు తాళలేక సదరు మహిళ దుర

పెళ్లైన ఏడు రోజులకే విడిపోయారు. అయినా భార్యను వదిలి వుండలేక.. ఆమె వద్దకు వెళ్లి వస్తుండేవాడు భర్త. కానీ పెళ్లైన ఏడు రోజులకే విడిపోయినా.. తరచూ ఇంటికి వచ్చి వెళ్తున్న భర్త వేధింపులు తాళలేక సదరు మహిళ దురుసుగా ప్రవర్తించింది. కట్టుకున్న భర్తని కనికరం లేకుండా చెప్పుతోనే కొట్టింది. దీంతో తీవ్ర వేదనకు గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా, మండల కేంద్రమైన చాట్రాయి గ్రామానికి చెందిన చుండూరు కిషోర్ (22) అదే మండలంలోని సి.గుడిపాడు గ్రామానికి చెందిన శ్యామలను పెళ్లాడాడు. పెళ్లైన ఏడు రోజులకే వీరి విడిపోయారు. కానీ కిషోర్ తనను వేధిస్తున్నాడంటూ ఈనెల 19న స్థానిక పోలీస్ స్టేషన్‌లో శ్యామల ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, కిషోర్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆమె జోలికి వెళ్లనని కిషోర్ హామీ పత్రం రాసిచ్చాడు. ఆ మరుసటి రోజు ఇద్దరినీ పోలీసులు స్టేషన్‌కు రప్పించి మాట్లాడుతుండగానే శ్యామల కిషోర్‌ను చెప్పుతో కొట్టి దురుసుగా ప్రవర్తించింది.  దీంతో, అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ముందు శ్యామల తనను చెప్పుతో కొట్టడాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ సైసూడ్ నోట్ కూడా రాశాడు. 
 
మరోవైపు, కిషోర్ చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ అతని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. శ్యామలతో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలంటూ, కిషోర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.