గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (15:47 IST)

చిత్రహింసలు భరించలేక.. తాగుబోతు భర్తకు విషమిచ్చి...

ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తాగుబోతు భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ ఇల్లాలు కట్టుకున్న భర్తకే విషమిచ్చి చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్త

ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తాగుబోతు భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ ఇల్లాలు కట్టుకున్న భర్తకే విషమిచ్చి చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గత నెల 26వ తేదీన రాం మనోహర్ లోహియా హాస్పిటల్ నుంచి ఢిల్లీ పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. శ్రీనివాస్ మూర్తి అనే స్పృహలో లేని ఓ వ్యక్తిని తీసుకొచ్చారని, అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలోనే మరణించాడని పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అతన్ని తీసుకొచ్చిన మహిళ తప్పుడు పేరు, చిరునామా ఇచ్చినట్లు గుర్తించారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆ మహిళ వచ్చిన కారు కనిపించింది. దానిని నంబర్ ట్రాక్ చేసి కాలిబరిలోని ఆ మహిళ ఇంటిని గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఆమె పేరు కేవీ రమగా తేలింది. ఈమె మృతుడి భార్య అని తేలగా, భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక విషమిచ్చి చంపినట్లు అంగీకరించింది. 
 
రోజు తాగివచ్చి గొడవ చేసేవాడని.. ఇక భరించడం కష్టంగా భావించే తన భర్తకు విషం ఇచ్చి చంపానని తెలిపింది. భగత్‌సింగ్ అనే ఆ తాంత్రికుడే ఆ విషన్నిచ్చినట్లు ఆమె చెప్పింది. ఆమెపై ఐసీసీ సెక్షన్లు 302, 120బీ, 201ల కింద కేసు నమోదు చేశారు.