1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 మే 2017 (13:18 IST)

ఇద్దరు ఆడపిల్లలు.. భర్త అక్రమ సంబంధం.. వివాహిత ఆత్మహత్య.. నట్టింట్లోనే పూడ్చేశారు

ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఆమెను చితక్కొట్టాడు. పైగా, ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఒక వైపు భర్త చిత్ర హింసలను, అత్తింటివారి

ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఆమెను చితక్కొట్టాడు. పైగా, ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఒక వైపు భర్త చిత్ర హింసలను, అత్తింటివారి వేధింపులు భరించలేని ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆ మృతదేహాన్ని నట్లింట్లోనే పూడ్చిపెట్టారు. తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ దారుణ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వీటిని పరిశీలిస్తే... 
 
మహబూబాబాద్‌ జిల్లా సోమారంకు చెందిన యాకయ్య తన కూతురు రాధికను(29) వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎనుమాములకు చెందిన విజయ్‌కుమార్‌కు ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆ సమయంలో బంగారం, వెండితో పాటు రూ.3.5 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు.
 
వీరి వైవాహిక జీవితాన్ని గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. దీంతో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. మొదటి పాప పుట్టినప్పుడు స్థలాన్ని కొనిచ్చారు. రెండో అమ్మాయి పుట్టినప్పుడు మరో రూ.3 లక్షలు చెల్లించారు. అలాగే ఎనిమిది నెలల క్రితం బాబు మన్విత్‌ జన్మించాడు. కొడుకు పుట్టినా వేధింపులు ఆపకపోవడంతో పాటు భర్త, అత్త, కుటుంబ సభ్యులు రాధికను హింసించడం ఎక్కువ చేశారు.
 
ఈ క్రమంలో భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని భార్య మందలించడంతో ఆయన కూడా చిత్ర హింసలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి రాధిక ఉరేసుకుని మృతిచెందినట్లు అత్తింటివారు సమాచారం ఇవ్వడంతో బంధువులతో కలిసి యాకయ్య ఎనుమాములకు వెళ్లారు. 
 
తన కూతురు మరణించడంతో ఆగ్రహంతో యాకయ్య, అతని బంధువులు దాడికి పాల్పడ్డారు. దీంతో మృతురాలి భర్త, అత్తింటి వారు ఇంటికి తాళం వేసుకుని పారిపోయారు. మృతురాలి పిల్లల పేరిట ఆస్తిని రాసివ్వాలని కోరగా అత్తింటి వారు నిరాకరించడంతో ఆగ్రహించిన బంధువులు.. మృతదేహాన్ని అత్తవారింట్లోకి తీసుకెళ్లారు. నట్టింట్లో గుంత తవ్వి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టారు. స్థానికులు కూడా వారికి మద్దతుగా నిలిచారు.