సోమవారం, 28 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (16:12 IST)

భూ వివాదం.. జేసీబీ కింద బిడ్డలతో పడుకున్న మహిళలు... ఎక్కడ? (video)

JCB
JCB
ఆస్తుల కోసం తగాదాలు మామూలే. ఆస్తుల కోసం ఏమైనా చేసేందుకు చాలామంది సిద్ధంగా వుంటారు. కారణం డబ్బు. ప్రస్తుత కాలంలో డబ్బు మనుషులే అధికమవుతున్నారు. డబ్బు కోసం ఏమైనా చేసేందుకు వెనకాడట్లేదు. 
 
ఈ విషయాన్ని పక్కనబెడితే.. చిత్తూరు జిల్లాలో ఆస్తి కోసం దారుణం జరిగింది. చిత్తూరు, పలమనేరు, బైరెడ్డి మండలం, తాతిరెడ్డి పల్లి గ్రామంలో పసిబిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళలు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. 
 
అయితే జేసీబీ నడిపే వ్యక్తి మహిళలపై బండిని ఎక్కించే ప్రయత్నం చేయడంతో.. కొందరు స్థానికులు షాకై మహిళలను పక్కకు లాగేశారు. రెండు వర్గాల మధ్య భూ వివాదం నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా జేసీపీ నడిపే వ్యక్తితో పాటు ఆస్తుల కోసం దారుణంగా ప్రయత్నించిన వారిపై తిట్టిపోస్తున్నారు. భూవివాదం కోసం ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు