ఏపీలో పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు..  
                                       
                  
                  				  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకుల భద్రత కోసం కొత్తగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. వీటిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. 
				  											
																													
									  
	 
	ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పర్యాటకుల భద్రత కోసం ఈ పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. పర్యాటక ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే వీటిని నెలకొల్పామని చెప్పారు. 
				  
	 
	ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు భయం, ఇబ్బంది లేకుండా ఈ పోలీస్ స్టేషన్లోని పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పారు. మొత్తం కోస్తా తీరంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో 26 పర్యాటక పోలీస్ స్టేషన్లను ప్రారంభించినట్టు సీఎం జగన్ గుర్తుచేశారు.