శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (11:27 IST)

రాష్ట్రంలో జరుగుతున్న తంతును వైఎస్ చూస్తున్నాడు : జగన్

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశంలోనూ పరలోకంలో ఉన్న నాతండ్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి చూస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా, ఆ మహానేత మరణించి వైఎస్ఆర్ మరణించి అయిదేళ్లు అయినా ప్రతి విషయానికి ఆయన పేరు ఆపాదించటం టీడీపీకి అలవాటైపోయిందని ఆక్షేపించారు. 
 
సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్నికల్లో పట్టుబడిన మద్యం, నమోదు చేసిన కేసులపై టీడీపీ సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరును ప్రస్తావించారు. దీనికి జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. 'వైఎస్ఆర్ చనిపోయి అయిదు సంవత్సరాలుపైన అయ్యింది... ఎన్నికలు జరిగి ముడు నెలలు అయ్యింది. ఈ మూడు నెలల్లో జరిగినవి కూడా వైఎస్ఆర్కే ఆపాదించటం టీడీపీకే చెల్లుతుందని' ఆయన వ్యాఖ్యానించారు.