1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 ఏప్రియల్ 2024 (14:20 IST)

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

Jaganmohan Reddy
విజయవాడ సింగ్ నగర్ లో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుదుటిపై రాయిదెబ్బ తగిలింది. రాయి విసిరిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరోజు తగిలిన రాయి దెబ్బకు సీఎం జగన్ బ్యాండేజ్ వేసుకుని తిరిగారు. ఐతే తాజాగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న సమయంలో ఆయన నుదుటిపై బ్యాండేజ్ కనిపించలేదు.
 
దెబ్బ తగిలిన ఆనవాళ్లు కూడా కనిపించకుండాపోయాయే, కనీసం కుట్లు వేసిన గుర్తులు కూడా కనిపించలేదంటూ ప్రతిపక్షాలు సీఎం రాయి దాడి గాయంపై సెటెర్లు వేస్తున్నాయి. దెబ్బ తగిలినా మచ్చ కూడా కనిపించదా.. అదేం దెబ్బో అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.