1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (11:34 IST)

చంద్రన్న కరవు యాత్ర అని పెట్టుకుంటే సూపర్‌గా ఉంటుంది: రోజా

రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. అయినప్పటికీ ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే పనికి శ్రీకారం చుట్టారని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు.

రైతుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న చంద్రయాత్రపై రోజా నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమానికి చంద్రన్న యాత్ర అనే పేరు సరిపోలేదని... చంద్రన్న కరవు యాత్ర అని పెట్టుకుంటే సూపర్‌గా ఉంటుందని ఎద్దేవా చేశారు.
 
ఈ నెల 9వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏపీలోని అన్ని జిల్లాలో ఈ యాత్రను చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో, రోజా ఈ విమర్శలు చేశారు. రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని రోజా వ్యాఖ్యానించారు.

నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటడంతో, ప్రజలు అల్లాడిపోతున్నారని... అయినా, ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే పనికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.