1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (11:19 IST)

ఆనందయ్య మందు తిని ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత : వైవీ సుబ్బారెడ్డి

కరోనా రోగుల కోసం కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు ఆరగించి ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆనందయ్య మందు వాడొచ్చు అని నిర్ధారణ ఇవ్వాల్సింది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అని, ఏపీ ప్రభుత్వం కాదన్నారు. 
 
ఆయుష్ విభాగం నుంచి టీటీడీ కాలేజ్‌కు ఇన్ఫర్మేషన్ వచ్చిందని... అధ్యయనం చేసి రిపోర్ట్ పంపాలని ఆదేశాలు వచ్చాయన్నారు. 500 మంది డేటా తీసుకుని అధ్యయనం జరుగుతుందన్నారు. టీటీడీ ఆయుర్వేదిక్ కాలేజి ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ప్రొఫైసర్లు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. 
 
క్లినికల్ ట్రయల్స్ కూడా చేయాలని సూచన చేశారని... అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అధ్యయనం పూర్తి అయ్యాక మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌కు నివేదిక పంపుతామన్నారు. అధ్యయనంకు వారం సమయం పట్టే అవకాశం ఉందని, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుండి అనుమతులు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో కూర్చుని ప్రతీ దాన్ని రాజకీయం చేస్తుంటారని మండిపడ్డారు. ‘‘అధ్యయనం చెయ్యకుండా పంపిణీ చేస్తే ఎవరికైనా ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు..? ఆయన తీసుకుంటారా..?’’ అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.