శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (14:35 IST)

తరచు పసుపు తీసుకుంటే బరువు తగ్గుతారా..?

పసుపు వంటకాల్లో ఎక్కువగా వాడే పదార్థం. ఈ పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ప్రతిరోజూ మనం చేసుకునే కూరల్లో పసుపు వేసుకుంటే ఆ రుచేవేరు. తరచు దీనిని ఉపయోగిస్తే కడుపులోని ఇన్‌ఫెక్షన్స్ తొలగిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. పసుపులోని మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
1. పసుపులో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకుని చర్మానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా తాజాగా మారుతుంది. 
 
2. రాత్రివేళలో గ్లాస్ గోరువెచ్చని పాలలో స్పూన్ కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే చక్కని నిద్ర పడుతుంది. పసుపులోని యాంటీ ఇఫ్లమేటరీ గుణాలు శరీరంలోని చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తాయి. క్రమంగా పసుపు నీటిలో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. 
 
3. పసుపు చెక్కలను ఎండబెట్టుకుని పొడిచేసుకోవాలి. ఈ పొడిని రోజూ వంటకాల్లో చేర్చుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుందని ఆయుర్వేదంలో తెలియజేశారు. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. 
 
4. బరువు తగ్గాలనుకునేవారు నూనెలో కప్పు ఉల్లిపాయలను వేయించి అందులో స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తరువాత రెండు కరివేపాకు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాల తరువాత దించేయాలి. ఇలా చేసిన మిశ్రమంలో వేడివేడి అన్నం కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బరువు తగ్గుతారు. అంతేకాదు, శరీరానికి కావలసిన ఎనర్జీనీ అందుతుంది. 
 
5. కండరాలు, ఎముకలు బలంగా ఉండాలంటే.. పసుపు క్రమంగా తీసుకోవాలి. అలానే పసుపులో కొద్దిగా నిమ్మరసం, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం పాటు చేస్తే ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి.