శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2016 (15:04 IST)

చలికాలంలో దాల్చిన చెక్కపొడి, తేనె మిశ్రమంతో గొంతునొప్పికి చెక్..

చలికాలంలో గొంతు నొప్పి సమస్యలు తప్పవు. అయితే గొంతునొప్పిని దూరం చేసుకోవాలంటే..? దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమం ద్వారా దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి నుం

చలికాలంలో గొంతు నొప్పి సమస్యలు తప్పవు. అయితే గొంతునొప్పిని దూరం చేసుకోవాలంటే..? దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమం ద్వారా దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తినటం లేదా పాలల్లో మిరియాలపొడి కలిపి తాగినా గొంతు సమస్యలు తగ్గుతాయి. 
 
గొంతులో మంటగా ఉంటే వెల్లుల్లి రెబ్బను తింటే ఉపశమనం లభిస్తుంది. గొంతులో గరగర వంటి సమస్యలు పోవాలంటే ఉల్లిపాయ రసం సేవించడం లేదా అల్లంతో చేసిన టీని గాని, అల్లాన్ని నీటిలో ఉడికించి ఆ నీటిని గాని సేవిస్తే గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వేడి నీటిలో కాస్త తేనె వేసి తీసుకుంటే గొంతునొప్పి నుంచి త్వర‌గా ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజూ తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి.