శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (10:52 IST)

పసుపు నీటితో స్నానం చేస్తే..?

సాధారణంగా చాలామంది మహిళలు సౌందర్యం అధిక శ్రద్ధ చూపుతుంటారు. మరి కొందరైతే ఎలాంటి విధానాలను వాడాలో తెలియక ఏవో తెలిసిన వాటిపై శ్రద్ధ చూపుతుంటారు. ఇంకొంతమందైతే క్రీములు వాడుతుంటారు కానీ, వాటి గురించి తెలుసుకోరు. అలా చేయడం చర్మం అందానికి అంత మంచిది కాదని చెప్తున్నారు. ఈ క్రీములలోని రసాయన పదార్థాలు చర్మాన్ని అందంగా మార్చుతాయి. కానీ, అదే అందం చివరి వరకు ఉంటుందని మనం చెప్పలేం.. కాబట్టి ఈ కొన్ని చిట్కాలు పాటించి.. ఇంట్లోనే ఎలా సౌందర్యం పొందాలో చూద్దాం..
 
స్నానానికి ఘాటుగా ఉన్న సబ్బులను వాడడం చర్మానికి మంచిది కాదు. కొందరైతే వేనీళ్ళు వేనీళ్ళు అంటూ వేడి వేడి నీళ్లతో తెగ స్నానాలు చేస్తుంటారు. అలా స్నానం చేస్తే చర్మం త్వరగా ముడతలు పడే అవకాశాలున్నాయని బ్యూటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అంత వేడిగా కాకుండా, మరి అంత చల్లని నీటితో స్నానం చేయకుండా కాస్త గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి. 
 
మరీ వేడిగా ఉన్న నీటిలో స్నానం చేస్తే చర్మంపై రంధ్రాలు ఏర్పడి డీ హై డ్రేషన్‌కు గురైయ్యే ప్రమాదాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. చర్మ సౌందర్యం కోసం అధికంగా పండ్లు, కూరాగాయు, జ్యూస్‌లు తీసుకోవడం వలన కూడా చర్మ ఛాయ పెంపొందుతుంది. వీటితో పాటు రోజుకోసారి ఐస్‌క్రీమ్స్ తినడం ద్వారా చర్మం మృదువుగా ఆకర్షణీయంగా తయారవుతుంది. కనుక ప్రతిరోజూ స్నానపు నీటితో కొద్దిగా నిమ్మరసం లేదా పసుపు కలిపి స్నానం చేయండి.. మంచి ఉపశమనం లభిస్తుంది..