మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (16:48 IST)

బ్లాక్ హెడ్స్‌ను తొలగించే.. దాల్చిన చెక్క...

ముఖంపై ఏర్పడే బ్లాక్ హెడ్స్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగినులకైతే ఈ తరహా సమస్యలు వేధిస్తాయనడంలో సందేహం లేదు. మొటిమలు వచ్చిన ఆ ప్రదేశంలో మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటిని తొలగించుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇలాంటి వారు ఈ తరహా పెరటి వైద్యంతో ఉపశమనం పొందొచ్చు. అవేంటో తెలుసుకుందాం..
 
సాధారణంగా చర్మంపై ఏర్పడే గాయాలకు మందుగా పసుపును వాడుతుంటారు. ఈ పసుపు నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది. ఎలాలో చూద్దాం.. పసుపులో కొద్దిగా పుదీనా రసం కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఆ ప్యాక్ బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖానికి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మూడు రోజులు పాటు క్రమం తప్పకుండా చేస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
నల్లటి మచ్చలు తొలగించాలంటే ఇలా చేయాలి.. దాల్చిన చెక్కను పొడిచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ రాత్రి పడుకునే ముందుగా వేసుకుని ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా వారం పాటు చేస్తే.. నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. దాంతో అలసట, ఒత్తిడి కూడా తొలగిపోతుంది. 
 
అలానే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా పసుపు, పెరుగు, తులసీ రసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలిగిపోయి ముఖం మృదువుగా మారుతుంది.