మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 4 జులై 2019 (20:31 IST)

బియ్యం, నువ్వులు సమాన భాగాలుగా తీసుకుని రాత్రంతా నానబెట్టి....

సాధారణంగా మన చర్మం రంగు ఎరుపా, చామనఛాయ అన్న విషయంతో సంబంధం లేకుండా అది ప్రకాశవంతంగా మెరుస్తుంటే చూసేకొద్దీ చూడాలని అనిపిస్తుంటుంది. అందుకే మనం చంర్మం మెరుపుని సంతరించుకోవడానికి అనేక రకములైన కాస్మోటిక్స్ వాడుతుంటాము. అలా చేయడం వలన సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాకాకుండా సహజసిద్దంగా లభించే పదార్దాలతో కొన్ని చిట్కాల ద్వారా మన చర్మాన్ని ప్రకాశవంతంగా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. బియ్యం, నువ్వులు సమాన భాగాలుగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. తరువాత రెండింటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం తేమని సంతరించుకుని అందంగా మెరుస్తుంటుంది.
 
2. ముఖాన్ని శుభ్రంగా కడిగి తేనె, ముల్తానా మట్టి కలిపిన మిశ్రమాన్ని పట్టించి పావుగంట తరువాత కొద్దిగా నీళ్లు తీసుకుని మెల్లగా మర్దనా చేస్తూ రుద్ది కడిగేయాలి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమంగా చర్మం మెరుపుని సంతరించుకుంటుంది.
 
3. కొవ్వు తక్కువగా ఉన్న పాలను తీసుకుని వాటిని ముఖానికి పలుచని పూతలా వేసి చర్మంలో కలిసిపోయేలా మృదువుగా మర్దనా చేయాలి. పది నిమిషముల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోయి ముఖం మృదువుగా ఉండి మెరుస్తుంటుంది.