గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (13:50 IST)

మెడమీద నలుపుగా ఉందా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

మీ మెడ నల్లగా మారిందా.. కొన్ని చిట్కాలు పాటించడం వలన మీ మెడ తెల్లగా, మృదువుగా చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి మెడమీద రుద్దుకుని 5 లేదా 10 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. నిమ్మకాయలలోని విటమిన్ సి మెడమీద ఉన్న మృతకణాలను నాశనం చేస్తుంది. 
 
అలాగే సూర్యరశ్మి వలన వచ్చే నలుపును కూడా తొలగిస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసంలో స్పూన్ దోసకాయరసం కొద్దిగా గంధం కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మెడమీద రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. రోజు ఈ విధంగా చేయడం వలన మీ మెడమీద నలుపు త్వరగా తగ్గిపోతుంది.
 
మెడ తెల్లగా కావాలంటే ఒక స్పూన్ గంధంలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రివేళ మెడకు రాసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడతెల్లగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా పసుపు కలిపి పెట్టుకున్నా కూడా మెడ తెల్లగా కనిపిస్తుంది. ఆలుగడ్డను ముక్కలుగా కోసుకుని రెండు వారాలకోసారి మెడమీద రుద్దుకుంటే మీరే ఆ తేడాని గమనించవచ్చును.
 
బాదం పప్పులను 5 నుంచి 6 తీసుకుని నాలుగు గంటలు నీళ్ళలో నానబెట్టాలి, ఆ తరువాత వాటికి పొట్టుతీసి కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పడుకునే ముందు మెడమీద రుద్దుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మెడ మీద గల నలుపు తొలగిపోతుంది. కలబంద రసాన్ని మెడమీద రుద్దుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకుంటే మెడతెల్లగా కనిపిస్తుంది.