శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 జూన్ 2017 (16:38 IST)

పైలట్ల వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల మెసేజ్‌లు.. డీజీసీఏఫైర్.. 13 పైలట్ల వద్ద?

పైలట్ల వాట్సప్ గ్రూప్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ గ్రూపులో అశ్లీల మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మండిపడుతోంది. ఇంకా ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్స

పైలట్ల వాట్సప్ గ్రూప్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ గ్రూపులో అశ్లీల మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మండిపడుతోంది. ఇంకా ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీసీఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన యాన సంస్థలకు చెందిన 34 మంది పైలట్ల వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల సందేశాలున్నట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు 13 మంది విమాన పైలట్ల వద్ద విచారిస్తున్నారు. 
 
ఈ విచారణలో తేలిన దోషులపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ డైరెక్టరు జనరల్ బీఎస్ భుల్లార్ తెలిపారు. అయితే పైలట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయాన్ని ఆయా విమానయాన సంస్థలకే వదిలిపెడుతున్నామని చెప్పారు. డీజీసీఏకు వ్యతిరేకంగా అశ్లీల మెసేజ్‌లు వుండటంపై అధికారులు షాక్ తిన్నారని.. వాటి స్క్రీన్ షాట్లను పోలీసులకు అప్పగించినట్లు బీఎస్ భుల్లార్ వెల్లడించారు.