శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (15:32 IST)

ఇండిగో విమాన టిక్కెట్లపై ఆఫర్లు... రూ.1099కే ప్రయాణం

దేశవాళీ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు విమాన ప్రయాణ టిక్కెట్లపై సూపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రాంతాల మధ్య తక్కువ చార్జీలను ప్రకటించింది. ఈ కనీస చార్జీని రూ.1,099 నుం

దేశవాళీ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు విమాన ప్రయాణ టిక్కెట్లపై సూపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రాంతాల మధ్య తక్కువ చార్జీలను ప్రకటించింది. ఈ కనీస చార్జీని రూ.1,099 నుంచి టికెట్లను అందుబాటులో ఉంచింది. ఢిల్లీ - జైపూర్ రూట్‌లో ఈ ధర వర్తిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
అలాగే, వైజాగ్ - హైదరాబాద్ మధ్య రూ.1,249ని ప్రయాణ టిక్కెట్‌గా నిర్ణయించింది. ఇక చెన్నై - బెంగళూరు మధ్య రూ.1,120, జమ్మూ - శ్రీనగర్ మధ్య రూ.1,168, వడోదరా - గౌహతీ మధ్య రూ.1,227, అగర్తలా - గౌహతీ మధ్య రూ.1,249, బెంగళూరు - చెన్నై మధ్య రూ.1,285, గోవా - బెంగళూరు మధ్య రూ.1,316 టికెట్లను అందుబాటులోకి ఉంచినట్టు పేర్కొంది. 
 
అయితే, వైజాగ్ - హైదరాబాద్‌ల మధ్య అక్టోబరు నెలలో అనేక తేదీల్లో టిక్కెట్లు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 11, 12, 15, 17, 19, 27, 29, 31 తేదీల్లో చౌక ధరకు టికెట్లు ఉన్నాయి. సాధారణంగా అయితే, ఈ రెండు నగరాల మధ్య సూపర్ లగ్జరీ బస్సు టికెట్ రూ.746 కాగా, ప్రయాణ సమయం 14 గంటలు. అలాగే గరుడ ప్లస్ సర్వీస్ అయితే, రూ.1,171 టికెట్ ధర కాగా, 12 గంటల సమయం పడుతుంది. ముందుగా ప్లాన్ చేసుకుంటే ఈ మార్గంలో అదనంగా రూ.100 చెల్లిస్తే గంటన్నర వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ ప్రయాణ టిక్కెట్ ధరలు పన్నులతో కలుపుకుని.