1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (09:33 IST)

నల్లధనం డిపాజిట్లపై ఐటీ శాఖ దృష్టి.. కంపెనీలకు నోటీసులు జారీ

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లపై నిషేధం విధించడంతో నల్లధన కుబేరులకు నిద్రపట్టడం లేదు. దీంతో తమ వద్ద ఉన్న నల్లధన రాసులను ఏదో విధంగా తెల్ల ధనంగా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లపై నిషేధం విధించడంతో నల్లధన కుబేరులకు నిద్రపట్టడం లేదు. దీంతో తమ వద్ద ఉన్న నల్లధన రాసులను ఏదో విధంగా తెల్ల ధనంగా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి వారిలో కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని బ్యాంకుల్లో అనేక కంపెనీలు డిపాజిట్లు చేశాయి.
 
కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు... బ్యాంకుల్లో రూ.2.5 లక్షలు దాటి డిపాజిట్ చేస్తున్న వారికి ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపే ప్రక్రియ ప్రారంభించింది. ఈస్ట్ సిక్కిం, గ్యాంగ్‌టక్ కేంద్ర కార్యాలయంగా సీతారాం ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ ఈనెల 13న రూ.4.51లక్షలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కిం శాఖలో డిపాజిట్ చేయడంతో ఇప్పుడు నోటీసులు అందాయి. అంతసొమ్ము డిపాజిట్‌కు సంబంధించి ఆర్థిక వనరులు ఎక్కడివని ఆదాయపన్ను శాఖ ప్రశ్నించింది. 
 
ఈనెల 25న సిలిగురిలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో హాజరై వివరణ ఇవ్వాలని సీతారాం ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులను ఆదేశించింది. సీతారాం ఎంటర్‌ప్రైజెస్ ఆదాయం పన్ను చెల్లిస్తున్న పక్షంలో గత రెండేళ్ల రిటర్న్స్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కూడా ఆదేశించింది. ఏదేమైనా లెక్కచూపలేని నగదును బ్యాంకుల్లో జమ చేసిన వారికి కష్టాలు తప్పవని ఈ నోటీసుతో అర్థమైపోయింది.