సినీ తారల వల్లే ఎన్పీఏ ఆస్తులు పెరిగాయ్ : ఆంధ్రా బ్యాంకు సీఎండీ!
సినిమా తారలు, రాజకీయ నాయకుల వల్లే తమ బ్యాంకులో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోయాయని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ వ్యాఖ్యానించారు. బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
పనిలోపనిగా.. ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా ఆయన ఓ హెచ్చరిక చేశారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను తిరిగి చెల్లించకపోతే.. ఆ బంగారాన్ని వేలం వేస్తామని కూడా చెప్పారు. తీసుకున్న రుణానికి వడ్డీ కానీ లేదా ప్రిన్సిపుల్ ఎమౌంట్ భాగము కానీ 90 రోజుల్లో చెల్లించని ఎడల ఆ మొత్తాన్ని నిరర్థక ఆస్తిగా పేర్కొంటారు.