1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (19:51 IST)

అల్లం, చిన్న ఉల్లిపాయలు రేట్లకు రెక్కలు.. రూ.140 వరకు..

తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు నిత్యావసరాలకు వినియోగించే కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. గత వారాలతో పోలిస్తే ఈ వారం ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
 
ముఖ్యంగా అల్లం, చిన్న ఉల్లిపాయలు కిలో 130 నుంచి 140 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. గత నెలలో కిలో చిన్న ఉల్లి 80 రూపాయలకు విక్రయించగా, ప్రస్తుతం 130 రూపాయలకు విక్రయిస్తున్నారు.

బెల్లం కిలో రూ.130 వరకు విక్రయిస్తున్నారు. వరుస వర్షాల కారణంగా రానున్న రోజుల్లో కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.