శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (10:27 IST)

మరో నీరవ్ మోడీ... రూ.800 కోట్ల రుణాలతో రోటామాక్ అధినేత పరారీ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) స్కామ్ తరహాలోనే కాన్పూర్‌లోని ప్రభుత్వరంగ బ్యాంకులూ రూ.800 కోట్లకుపైగా చేతి చమురు వదిలించుకున్నాయి. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) స్కామ్ తరహాలోనే కాన్పూర్‌లోని ప్రభుత్వరంగ బ్యాంకులూ రూ.800 కోట్లకుపైగా చేతి చమురు వదిలించుకున్నాయి. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ రుణాన్ని తీసుకున్న రోటామాక్‌ (కలాల తయారీ) కంపెనీ అధినేత విక్రమ్‌ కొఠారీ దేశం విడిచి పారిపోయినట్టు సమాచారం. 
 
ఈయన అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా... ఈ అయిదు బ్యాంకులూ కొన్ని నిబంధనల్ని అతిక్రమించి మరీ రుణాలు ఇచ్చినట్టు సమాచారం.  
 
ముంబైలోని యూనియన్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.485 కోట్లు, కోల్‌కతాలోని అలహాబాద్‌ బ్యాంక్‌ నుంచి రూ.352 కోట్లు తీసుకుని, ఏడాది తర్వాత కూడా అసలు గానీ, వడ్డీగానీ కొఠారీ చెల్లించలేదు. దీంతో రోటోమాక్‌ గ్లోబల్‌ ప్రై.లి. సంస్థని 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు'గా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గత యేడాది ప్రకటించింది.
 
పైగా, కాన్పూర్‌ సిటీసెంటర్‌ రోడ్లోని కార్యాలయం వారం రోజులుగా మూతపడే ఉంది. అప్పటినుంచి అధినేత ఆచూకీ తెలియరావడంలేదు. కొఠారీ కూడా నీరవ్‌ మోదీ మాదిరిగా విదేశాలకు చెక్కేసినట్లు అనుమానాలు నెలకొన్నాయి.