1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (10:26 IST)

ఇతరుల ఖాతాలో జమచేస్తే ఏడేళ్ళ జైలుశిక్ష : ఐటీ శాఖ వార్నింగ్

తమ వద్ద ఉన్న పాతనోట్లను ఇతరుల ఖాతాల్లో జమ చేసేవారికి ఆదాయపన్ను శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి వారికి గరిష్టంగా ఏడేళ్ళ మేరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. దీంతో నల్లకుబేరుల్లో వ

తమ వద్ద ఉన్న పాతనోట్లను ఇతరుల ఖాతాల్లో జమ చేసేవారికి ఆదాయపన్ను శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి వారికి గరిష్టంగా ఏడేళ్ళ మేరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. దీంతో నల్లకుబేరుల్లో వణుకు మొదలైంది. 
 
అలాగే, ఐటీశాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక్కో ఖాతాలో రూ.2.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ న‌గ‌దు ఉంటే ఆ వివరాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న ఖాతాల్లో రూ.50 వేల వ‌ర‌కు జ‌మ‌చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 
 
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఆ నోట్లను మార్చుకునేందుకు న‌కిలీ బాబులు జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ను ఉప‌యోగించుకుంటున్నట్టు వ‌స్తున్న వార్తల నేప‌థ్యంలో ఐటీ శాఖ ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈనెల 8వ తేదీ త‌ర్వాత బ్యాంకు ఖాతాల్లో అయిన న‌గ‌దు జ‌మ వివ‌రాల‌ను ఐటీ శాఖ రాబ‌డుతోంది. 
 
కొన్ని ఖాతాల్లో అసాధార‌ణ‌, అనుమానాస్ప‌ద రీతిలో పెద్ద‌మొత్తంలో న‌గ‌దు జ‌మ అవుతున్న‌ట్టు గుర్తించింది. ఈ విష‌య‌మై ఫిర్యాదులు అందుకున్న ఐటీశాఖ అక్ర‌మార్కుల ప‌నిప‌ట్టేందుకు సిద్ధ‌మైంది. ఇత‌రుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేసే వారికి ఏడేళ్ల జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.